టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే దాదాపు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉత్పాతంలో వందలాది భవనాలు, ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అయితే వరుస ప్రకంపనల మధ్య సహాయక చర్యలు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. శిథిలాల తొలగింపు కోసం వేల మంది సైన్యాన్ని దింపాయి ఈ దేశాలు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. తొలి ప్రకంపన తర్వాత మళ్ళీ మరో రెండు, మూడు తీవ్ర స్థాయి ప్రకంపనలు సహా మొత్తం 40 వరకు ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.
ఈ నేపథ్యంలో టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపం విషాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో.. ‘టర్కీ మరియు సిరియా దేశాలలో సంభవించిన భూకంప విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయ్యాను. ఇది నిజంగా మానవాళికి చాలా బాధాకరమైన రోజు. ఈ కష్ట కాలంలో ఆ రెండు దేశాల ప్రజలకు భగవంతుడు శక్తి ప్రసాదించాలి. అలాగే ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.
Shocked to see the visuals of devastation in Turkey & Syria! Truly a very sad day for humanity
Prayers for strength & wholehearted condolences to the bereaved families 🙏#TurkeyEarthquake
— KTR (@KTRBRS) February 7, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE