తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సిరిసిల్లలోని కలెక్టరేట్ లో జేడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ తో పాటుగా ఇతర ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో, గ్రామాల్లో సరఫరా చేసే త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక భారీ వర్షాలతో నిండిన చెరువులు, రిజర్వాయర్ల నుండి నీటిని విడుదల చేసే ముందు పరిసర గ్రామ ప్రజలకు, పోలీస్, రెస్క్యూ టీమ్, ఇతర శాఖలకు సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలతో నిండుకుండలా మారి అలుగు దుంకుతున్న నర్మాల ఎగువమానేరు జలాశయం వద్ద గంగమ్మ తల్లికి మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టీఏఎస్కే) ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్, బ్యాంకు మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఇవ్వనున్న ఉచిత శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY