ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టిన ఆయన పోలవరం సహా ఇతర వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకి సమ్బన్ధంచి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణాలతో పాటు ప్రస్తుతం వరదల కారణంగా ఎదురవుతున్న పరిణామాలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ రావత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడిన గ్యాప్ల మరమ్మత్తు వేగంగా చేయాలని సూచన.
- గ్యాప్–1, గ్యాప్–2 రెండు గ్యాప్లను పూడ్చే పనులను వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టగానే చేపట్టాలని ఆదేశం.
- పోలవరం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్ల వరకు ఉందని వెల్లడి.
- ప్రాజెకు కోసం జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్గా రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి విడుదలయ్యేలా కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు ఆదేశం.
- పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించిన హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచన.
- అలాగే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న రాష్ట్రంలోని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి లక్ష్యాల నిర్దేశం.
- మరో ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి నెలవారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ఆదేశం.
- ఇంకా, కర్నూలు పశ్చిమ ప్రాంతం దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదని, ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని సూచన.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ