బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్, నగరంలో నేడు 25 ప్రారంభం

Basthi Dawakhana, Basthi Dawakhana in Ramreddy Nagar Basti, Basthi Dawakhana News, Basthi Dawakhana Telangana, Habsiguda, Minister KTR, Minister KTR Inaugurated a Basthi Dawakhana, Ramreddy Nagar, Ramreddy Nagar Basti, telangana, Telangana News

ఉప్పల్ నియోజకవర్గం, హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్ బస్తీలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు ప్రారంభించారు. నగరంలోని బస్తీలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని మంత్రి కేటిఆర్ అన్నారు. ఈ బస్తీ దవాఖానాల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యంతో పాటు ఉచిత మందులు, సాధారణ వైద్య పరీక్షలు వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

మరోవైపు ఈ రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 25 బస్తీ దవాఖానాల ప్రారంభం జరుగుతుంది. మంత్రి కేటిఆర్ 4, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 4, డిప్యూటీ స్పీకర్ పద్మారావు 2, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ 3, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 2, మేయర్ బొంతు రాంమోహన్ 3, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుతో కలిపి వివిధ ప్రాంతాల్లో మొత్తం 25 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తున్నారు. నూతన బస్తీ దవాఖానాలతో కలిపి జీహెచ్‌ఎంసీ పరిధిలో వాటి సంఖ్య 195 కు చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =