డిసెంబర్ 9 వ తేదీన విదేశీ ప్రముఖులకు ఆతిధ్యమిచ్చేందుకు హైదరాబాదు వేదిక కానుంది. 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులకు మరియు హైకమిషనర్లకు అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి ఈ పర్యటనను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , అడ్వాన్స్ బృందం ఛీఫ్ ప్రోటోకాల్ అధికారి నగేశ్ సింగ్, ఐ.ఎఫ్.ఎస్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో శుక్రవారం నాడు సమావేశం నిర్వహించి ఈ పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పర్యటనలో ప్రఖ్యాత విదేశీ రాయబారులు దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ కై పనిచేస్తున్న భారత బయోటెక్ లిమిటెడ్ మరియు బయోలాజికల్ సంస్థ పరిశ్రమ యూనిట్లను సందర్శిస్తారని తెలిపారు.
ప్రముఖుల పర్యటనకు కోవిడ్ -19 ప్రోటోకాల్ కు అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తి , పంపిణీకి సంబంధించి హైదరాబాద్ ప్రత్యేకతను తెలిపే విధంగా ఫార్మాసిటీ మరియు జెనోమ్ వ్యాలీ వివరాలతో కూడిన ప్రజెంటేషన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జి.ఎ.డి.(పోలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి.సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ