తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటీసీ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని(ఉత్పత్తుల తయారీ పరిశ్రమ) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ కంపెనీ చైర్మన్, ఎండీ సంజీవ్ పురి, సంస్థ ప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ఐటీసీ తయారీ పరిశ్రమ 450 కోట్ల ప్రారంభ పెట్టుబడిని కలిగిఉండగా, స్థిరమైన అగ్రి-వాల్యూ చైన్ లో పెద్ద ఎత్తున జీవనోపాధిని సృష్టిస్తుందని తెలిపారు. ఈ ఐటీసీ పరిశ్రమలో బిస్కెట్లు, నూడుల్స్, గోధుమ పిండి, చిప్స్ తయారు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, స్థానిక రైతుల నుండి తమ ఉత్పత్తులకు మరింత ముడిసరుకును సేకరించాలని ఐటీసీ కంపెనీ చైర్మన్, ఎండీ సంజీవ్ పురిని కోరారు. తెలంగాణలో ప్రస్తుతం గ్రీన్ (వ్యవసాయం), బ్లూ (మత్స్య), వైట్ (పాలు), పింక్ (మాంసం) మరియు ఎల్లో (ఎడిబుల్ ఆయిల్) వంటి ఐదు విప్లవాలు అమల్లో ఉన్నాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో మరియు ఇతర ప్రపంచంతో తెలంగాణ బాగా అనుసంధానించబడి ఉంది. రాష్ట్ర మౌలిక సదుపాయాలు దేశంలోనే అత్యుత్తమమైనవని, ప్రభుత్వ పాలన చురుకుగా మరియు ప్రగతిశీలంగా సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఐటీసీ లిమిటెడ్ తన తయారీ స్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అది రాష్ట్రానికి, సంస్థకు విజయాన్ని పొందే పరిస్థితి అవుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీసీ లిమిటెడ్ అగ్రి మరియు ఐటీ బిజినెస్ల గ్రూప్ హెడ్ ఎస్.శివకుమార్, ఫుడ్స్ బిజినెస్ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE