హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన, ఆధునికమైన 50 కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. అలాగే నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్యపార్కు వద్ద కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను కూడా ప్రారంభించారు. ఒకొక్కటి 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ కంప్యాక్టర్ వాహనాల ద్వారా 15 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించనున్నారు. ఈ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
Municipal Administration Minister @KTRTRS along with Ministers @mahmoodalitrs & @YadavTalasani flagged off 55 Municipal Solid Waste (MSW) Vehicles at HMDA grounds in Khairatabad. Mayor @bonthurammohan, MLA @DNRTRS and Prcl Secy @arvindkumar_ias were present. pic.twitter.com/we1OtjhbVL
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 12, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ