గచ్చిబౌలిలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నూతనంగా నిర్మిస్తున్న క్యాంపస్ కు గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం తర్వాత, హైదరాబాద్ లో నిర్మించే ఈ క్యాంపస్ గూగుల్ యొక్క రెండవ అతిపెద్ద క్యాంపస్ గా నిలవనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ గూగుల్ క్యాంపస్ రాబోయే దశాబ్దాల పాటు హైదరాబాద్ కు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా గూగుల్ సంస్థ అందిస్తున్న నిరంతర మద్దతుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మరియు గూగుల్ ఇండియా మధ్య నేడు ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. సుస్థిర ఆర్థికాభివృద్ధి మరియు సమ్మిళిత సామాజిక అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలనే విజన్ కు మద్దతు ఇవ్వడానికి మరియు వేగవంతం చేయడానికి ఈ ప్రభుత్వం, గూగుల్ ఇండియా మధ్య ఎంఓయూ కుదిరింది. వెనుకబడిన యువతకు గూగుల్ కెరీర్ సర్టిఫికేట్ స్కాలర్షిప్లను అందించడానికి, డిజిటల్, వ్యాపారం అండ్ ఆర్థిక నైపుణ్యాల శిక్షణ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి మరియు డిజిటల్ బోధన, పరిష్కారాలతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి గూగుల్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, గూగుల్ ఇండియా కంట్రీ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా నేడు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ