వరంగల్ జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన కె. నరసింహారెడ్డితో మార్చ్ 16, సోమవారం నాడు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ గురించి మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా తన సొంత గ్రామ అభివృద్ధికి ₹ 25 కోట్లు విరాళంగా అందించిన కె. నర్సింహరెడ్డితో సమావేశమవ్వడం ఏంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సొంతగ్రామం అభివృద్ధి కోసం ముందుకొచ్చిన నరసింహారెడ్డికి మంత్రి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నర్సింహరెడ్డి వంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కొనియాడారు. కేటీఆర్ను కలిసిన వారిలో నర్సింహరెడ్డితో పాటుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా రూ.1.50 కోట్ల చెక్కును నర్సింహరెడ్డి మంత్రి కేటీఆర్ కు అందించారు. తన విరాళాన్ని వర్దన్నపేట మండల కేంద్రంలోని వైద్యశాల అభివృద్ధికి వినియోగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను నర్సింహారెడ్డి కోరారు.
[subscribe]