తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం కూకట్ పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కే.పీ.హెఛ్.బీ కాలనీ, ఫేజ్-9 లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, స్టార్మ్ వాటర్ నాలా, ఐ.డి.ఎల్ చెరువు మరియు హెచ్ఐజీ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే కే.పీ.హెఛ్.బీ కాలనీ, ఫేజ్-7 లో నిర్మించిన ఆధునిక వైకుంఠధామాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మరియు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE