దేశంలో మరియు రాష్ట్రంలో ఇంధన ధరలను పెంచటంపై మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేయడంలేదని, అంతర్జాతీయ విపణిలో ధరలు పెరగటం వలనే దేశంలో కూడా ధరలు పెంచామని కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చించటానికి ఎందుకు సుముఖత చూపడంలేదని మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి సీతారామన్ను అడిగారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను తెలిపారు.
Read about Chinese torture only in books!
This consecutive 80 paisa #FuelPriceHike 12th hike in 14 days outdoes any torture & a record of sorts 👏
FM @nsitharaman Ji, why hesitate to debate in parliament on crude oil prices, the Cesses that we can do away with to reduce prices?
— KTR (@KTRTRS) April 4, 2022
చైనీస్ టార్చర్ గురించి బుక్స్ లో చదివామని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12వ సారి లీటర్కు 80 పైసల చొప్పున పెట్రోల్ ధరలు పెంచి సరికొత్త రికార్డు సృష్టించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యాట్ను పెంచలేదని గుర్తుచేశారు. కేంద్రపభ్వుతం విపరీతంగా ధరలను పెంచుకుంటూ పోతోందని, ఇది సామాన్యుడిపై మోపలేని భారాన్ని కలిగిస్తోందని అన్నారు. కావున వెంటనే కేంద్రం పెంచిన సెస్సులను తగ్గించాలని, దీనివలన ఇంధన ధరలు 30% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ