తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్శించేందుకై యూకే పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం కర్ణాటక ఎన్నికల ఫలితాలను పరిశీలించిన అనంతరం ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ‘కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఏ విధంగా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు. వికృతమైన, విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వంటి విషయాల్లో హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే కర్ణాటకలో ఏర్పడబోయే కాంగ్రెస్ కొత్త ప్రభుత్వనికి నా శుభాకాంక్షలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
— KTR (@KTRBRS) May 13, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE