హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ వెంబడి సోలార్ రూఫ్ టాప్ తో కూడిన ప్రపంచస్థాయి సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈ సైక్లింగ్ ట్రాక్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సెప్టెంబర్ 6, మంగళవారం) శంకుస్థాపన చేయనున్నారు. నానక్రామ్గూడ-టీఎస్పీఏ మరియు నార్సింగి-కొల్లూరు స్ట్రెచ్లో ఓఆర్ఆర్ వెంబడి 4.5 మీటర్ల వెడల్పుతో 23 కిలోమీటర్ల మేర 3 లేన్ బై-సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ సైక్లింగ్ ట్రాక్ సోలార్ రూఫ్ టాప్ మరియు సీసీటీవీలతో సహా అన్ని భద్రతా ఫీచర్లతో 24/7 పని చేయనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ తెలిపారు.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “హైదరాబాద్లో సోలార్ రూఫ్తో కూడిన ప్రపంచ స్థాయి సైక్లింగ్ ట్రాక్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాను. అందులో భాగంగా ప్రారంభ 23 కిమీ కోసం రేపు పునాదిరాయి వేస్తున్నాను. 2023 వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు. అలాగే ఈ సైక్లింగ్ ట్రాక్ కు సంబంధించిన డెమో ఫొటోలను కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY