తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించి, అక్కడ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను, (ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
హుజురాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవన సముదాయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్మికుంట కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కూడా మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE