తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/జిల్లాపరిషత్/ఎయిడెడ్/ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మరియు వివిధ నిర్వహణ సంస్థల కింద ఉన్న అన్ని పాఠశాలలోని పదో తరగతి (ఎస్ఎస్సీ/ఓఎస్ఎస్సీ/ఒకేషనల్) విద్యార్థులను పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కాగా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.
కరోనా కారణంగా రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ బదులు విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్-1 (ఎఫ్ఏ-1) మాత్రమే నిర్వహించారు. ఎఫ్ఏ-1 కు 20 మార్కులు కేటాయించగా, ప్రస్తుతం విద్యార్థులకు అందులో వచ్చిన మార్కులను 100కి లెక్కించి గ్రేడులను కేటాయించనున్నారు. మరోవైపు బోర్డు నిర్ణయించిన ప్రాతిపదికన విద్యార్థులు/విద్యార్థినిలకు కేటాయించిన మార్కులతో ఎవరైనా సంతృప్తి చెందకపొతే, వారికీ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్ష రాసే అవకాశం ఇవ్వబడుతుందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ