తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ లోకేష్ కుమార్ లతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బోయగూడలోని జీహెఛ్ఎంసీ పార్క్ లో మొక్కలను నాటి 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. అనంతరం పార్క్ మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. పార్క్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చెస్ గేమ్, పిల్లల క్రీడా సామాగ్రిని పరిశీలించారు. ఎంతో అద్భుతంగా పార్క్ ను నిర్మించారని అధికారులను అభినందించారు. కాలనీ వాసులతో మాట్లాడి పార్క్ ను మంచిగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu