హైదరాబాద్ మహా నగరంలో మరోక ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర ప్రజలకు, పర్యటకులకు మరింత ఆహ్లదం కలిగించేలా నగరంలోని లుంబినీ పార్క్ సమీపంలో హుస్సేన్సాగర్ లో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్ లో ఈ ఫ్లోటింగ్ మ్యూజిక్ ఫౌంటెన్ ను గురువారం రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెఛ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు.
ఈ ఫ్లోటింగ్ మ్యూజిక్ ఫౌంటెన్ ను రూ.17.2 కోట్ల వ్యయంతో 180మీటర్ల పొడవు,10 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల ఎత్తుతో హెచ్ఎండీఏ రూపొందించింది. ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ థీమ్ లతో సాగే మ్యూజిక్ ఫౌంటెన్ ప్రదర్శన మూడు సార్లు ఉంటుందని, ఇక వీకెండ్స్, ప్రత్యేక రోజుల్లో ప్రదర్శనల సంఖ్య పెంచనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE