ప్రజా గోస-బీజేపీ భరోసా: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్

Telangana BJP will Organise 11000 Street Corner Meetings Across the State from Feb10-25,Telangana BJP,BJP 11000 Street Corner Meetings,Praja Gosa Bjp Bharosa List,Praja Gosa Bjp Bharosa Telangana,Mango News,Mango News Telugu,Praja Gosa Bjp Bharosa List Telangana,Praja Gosa Bjp Bharosa,Bjp To Launch Praja Gosa Bjp Bharosa,Latest News On Praja Gosa Bjp Bharosa,Live Praja Gosa,Praja Gosa Bjp Bharosa Live Udates,Praja Gosa Bjp Bharosa Latest News And Updates

తెలంగాణ బీజేపీ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి (ఫిబ్రవరి 10, శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటుగా రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 11,000 శక్తి కేంద్రాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి చౌరస్తాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రీట్ కార్నర్ సమావేశాల ప్రారంభ సమావేశం నిర్వహించారు.

ప్రజలకు ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశాల్లో ప్రజలకు వివరించనునట్టు బీజేపీ నేతలు పేర్కొన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ప్రారంభానికి నియోజకవర్గాల వారీగా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హాజరుకానున్నారు. కాగా ఇటీవలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడలో 11వేల శక్తి కేంద్రాల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొనే స్పీకర్ల వర్క్ షాప్ ను కూడా బీజేపీ నేతలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nine =