తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సత్వరమే విచారణకు తీసుకోవాలని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. సిట్ దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో కేసును సీబీఐకి అప్పగిస్తే, ఇప్పటివరకూ చేసిన దర్యాప్తు విఫలమవుతుందని దుష్యంత్ దవే కోర్టుకు విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ముందు ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక దీనిపై స్పందించిన సీజేఐ చంద్రచూడ్, రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం పిటిషన్ను విచారణకు అనుమతి ఇస్తామని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE