తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబర్ 25 నుండి ప్రారంభం కాగా, అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటుగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ మహిళా విభాగం ఈ బతుకమ్మ సంబురాలను నిర్వహించడంతో తెలంగాణ భవన్ లో సందడి నెలకుంది. ఈ బతుకమ్మ సంబరాల్లో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జీహెఛ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ సుధారాణితో పాటుగా పలువురు టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చగా, పలువురు సంతోషంగా బతుకమ్మ పాటలు పడుతూ, నృత్యాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ “సాంప్రదాయ జానపద సంగీతంతో ఆనందంగా మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబం ఈరోజు తెలంగాణ భవన్లో బతుకమ్మను జరుపుకుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY