తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ట్వీట్ చేశారు. “సీఎం కేసీఆర్ సమాజ మార్పునకు టార్చ్ బేరర్ గా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన పథకాలు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద ఈరోజు 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు, వారి కుమార్తెలకు పెళ్లి చేసేందుకు ఆసరాగా ఉండేందుకు ఒక విజన్ ప్రారంభించబడింది. దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన కళ్యాణలక్ష్మి పథకం ద్వారా వివాహానికి సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయంతో తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లి చేసే స్థితి నుండి ఆనందంగా పెండ్లి చేసే పరిస్థితి పేద కుటుంబాల్లో ఏర్పడింది” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ