మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ, టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నాయకుల పరిస్థితి ఏమైందో అందరికి తెలుసన్నారు. పార్టీలోకి వచ్చినపుడు దేవుడు అంటారని, వెళ్లేప్పుడు దెయ్యం, నియంత అంటారని, ఈటల రాజేందర్ కూడా అదే మాట్లాడారన్నారు. 2003 లో హుజురాబాద్ లో పార్టీ నిండుకుండలా ఉన్నప్పుడు ఈటల ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చాడన్నారు. అప్పటి నుంచి ఈటలను గౌరవించి జిల్లా అధ్యక్షుడిగా, లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ వచ్చాక రెండు సార్లు మంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ తర్వాత పార్టీలో గాని, ప్రభుత్వంలోగాని అన్ని పదవులు పొందింది ఈటల రాజేందర్ అని పల్లా పేర్కొన్నారు.
ఆత్మగౌరవం దెబ్బతింటే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు:
ప్రగతి భవన్ లోకి రానివ్వలేని అంటున్నారని, ఆత్మగౌరవం దెబ్బతింటే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని పల్లా ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే, వారికీ సంబంధించిన భూమిని ఎలా కొంటారని, చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా విమర్శించారు. ఆస్తులను రక్షించుకోవడం మీద ప్రేమే తప్ప ఆత్మ మీద గౌరవం కాదని అన్నారు. ఆత్మ గౌరవం ఉంటే 6 నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని తొక్కి పెట్టి వాళ్లను హింసిస్తున్న బీజేపీలో ఎలా చేరుతున్నారని పల్లా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పై అనవసరంగా నోరు పారేసుకుంటే సూర్యుడిపై ఉమ్మి వేసినట్టేనని అన్నారు. ఈటల వెనుక హుజురాబాద్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గాని లేరని, కొద్ది మంది అసంతృప్తి వాదులు మాత్రమే ఉన్నారన్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ