తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మునుగోడులో ఎన్నికల ప్రచార గడువు కూడా నవంబర్ 1, మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ క్రమంలో మునుగోడులో మూడు రోజుల పాటుగా వైన్ షాపులు కూడా బంద్ కానున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో నవంబర్ 1, మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి నవంబర్ 3, గురువారం సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్/మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 3న జరిగే పోలింగ్ లో నియోజకవర్గం వ్యాప్తంగా 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రచార గడువు కూడా మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తూ, ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE