తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 1 మరియు 2వ తేదీల్లో అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో (జిసివిసి) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రానికి అందాల్సిన కరోనా వ్యాక్సిన్ డోసులు అందని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా నేటి నుంచి (మే 1, శనివారం) 18-44 ఏళ్ల వారికీ కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు రాష్ట్రానికి ఇంతవరకు 48,82,830 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించగా, ఏప్రిల్ 30, శుక్రవారం 9 గంటల వరకు 47,73,744 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు వినియోగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 62,970 వ్యాక్సిన్ డోసులు ఆర్మీ దళాలకు అందజేసినట్టు తెలిపారు. అలాగే 0.96 శాతం వ్యాక్సిన్ వృధా జరిగినట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ