రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ సీపీ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని చైర్ పర్సన్ సునిత లక్ష్మారెడ్డి ఆదేశించారు.
మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ, పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100, మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181 లేదా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 9490555533 కి పీర్యాదు చేయవచ్చని సూచించారు. బాధితురాలికి మహిళా కమిషన్ మరియు ప్రభుత్వం అండగా ఉంటాయని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE