హైదరాబాద్లో డ్రగ్స్ భూతం విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు ఈ దందాలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కేటుగాళ్లు ఏమాత్రం మారడం లేదు. కొత్త పుంతలు తొక్కుతూ నగరంలోకి మాదకద్రవ్యాలను తీసుకొస్తున్నారు. డ్రగ్స్ తీసుకొస్తున్న కేటుగాళ్ల నెట్వర్క్ చూసి పోలీసులే విస్తుపోతున్నారు. ఇప్పటికే ఓసారి హైదరాబాద్లోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. బడాబాబులు ఈ వ్యహారంలో తెరపైకి వచ్చారు. ఇప్పడు మరోసారి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దీని వెనుక బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండడంతో మరోసారి సంచలనంగా మారింది.
గచ్చిబౌలి రాడిసన్ హోటల్లోని ఓ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారని తెలిసి పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు ముందుగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారు? వారికి కొకైన్ ఎవరు సప్లై చేశారనే కోణంలో పోలీసులు తీగ లాగగా.. డొంకే కదులుతోంది. బడా బిజినెస్మెన్లు, రాజకీయ నాయకులు, సీని డైరెక్టర్లు బయటపడుతున్నారు. ఈ కేసులో ఇద్దరు అమ్మాయిలతో కలిసి మొత్తం 9 మంది బడాబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రముఖంగా ఓ బాడా వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనే శెలగంశెట్టి కేదార్నాథ్. ఈయన సినీ హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్కి బిజినెస్ పార్ట్నర్. అల్లు అర్జున్ బిజినెస్లు.. జూబ్లీ 800 పబ్, హై లైఫ్, బఫెలో వైల్డ్ వింగ్స్ పబ్లలో కేదార్నాథ్కు కూడా పార్ట్నర్ షిప్ ఉంది. కేదార్నాథ్ ప్రొడ్యూసర్గా తెలుగులోని పలు సినిమాలను కూడా నిర్మించారు. అయితే రాడిసన్ హోటల్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో కేదార్నాథ్దే పెద్ద పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారానే కొకైన్ సప్లై చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. అయితే అల్లు అర్జున్ బిజినెస్ పార్ట్నర్, బడా వ్యాపారవేత్త కావడంతో ఆయన పేరు బయటకు రాకుండా కొందరు పెద్దలు దాస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక ఈ వ్యవహారంతో రాడిసన్ హోటల్ ఓనర్ కొడుకు వివేక్, స్టార్ డైరెక్టర్ క్రిష్, వారి స్నేహితుడు నిర్భయ్ సింధీకి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే వారు డ్రగ్స్ వినియోగించినట్లు కూడా తేల్చారు. వారికి డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ కొకైన్ సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారణ జరుపుతున్నకొద్దీ ఈ వ్యవహారంలో శెలగంశెట్టి కేదార్నాథ్దే కీలక పాత్ర ఉన్నట్లు బయటపడుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ