తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. మంగళవారం ఉదయం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,28,262 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,94,378 మంది ఉత్తీర్ణులు కాగా, 63.32 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని అన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలురు 54.25 శాతం, బాలికలు 72.33 శాతం ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.
అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,95,249 మంది ఉత్తీర్ణులు కాగా, 67.82 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ద్వితీయ సంవత్సరంలో బాలురు 60 శాతం, బాలికలు 75.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాల్లో కూడా ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయిగా ఉంది. మరోవైపు జూన్ 30 నుంచి రీకౌంటింగ్/రెవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని, ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2022లో భాగంగా మే 6 నుంచి మే 23 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మే 7 నుంచి మే 24 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 9,28,262 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, ఇందులో 4,64,892 మంది ప్రథమ, 4,63,370 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉన్నారు. వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం తాజాగా ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY