కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా.. ముందుగా ఈ నెల 28న వరంగల్లో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు 29న హైదరాబాద్లో పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈమేరకు నిన్న తెలంగాణ రాష్ట్ర నేతల సమావేశంలో ఆయన తెలంగాణ పర్యటన తేదీలను గురించి ఖరారు చేశారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా.. పలు రాష్ట్రాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నిన్న జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన 38 మంది సీనియర్ నేతల నేతలతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే, పార్టీలోని సీనియర్ నాయకులందరూ అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని, ఎవరూ క్రమశిక్షణ రేఖను దాటవద్దని రాహుల్ హెచ్చరించారు. అలాగే పార్టీలో ఏవైనా అంతర్గత విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించటానికి పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ