తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీ డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడోరోజు (జనవరి 4, బుధవారం) జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏడో రోజున 1,49,970 మంది రైతుల ఖాతాల్లోకి రూ.263.71 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. 5 లక్షల 27 వేల 434.25 ఎకరాలకు నిధులు విడుదల జరిగిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53 లక్షల 928 మంది రైతులకు గానూ రూ.4031.07 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE