గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిల్లో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్ 28, మంగళవారం జరగాల్సిన బీటెక్/బీఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్ ప్రకటించారు. సెప్టెంబర్ 29 నుంచి జరగాల్సిన మిగతా అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు
అలాగే భారీ వర్షాల వలన ఓయూ పరిధిలో సెప్టెంబర్ 28, మంగళవారం మరియు సెప్టెంబర్ 29, బుధవారం నాడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 30 నుంచి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఇతర యూనివర్సిటీల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు, సెప్టెంబర్ 30 న నిర్వహించాల్సిన టీఎస్ పీఈసెట్-2021 ప్రవేశపరీక్షను కూడా వాయిదా వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ