హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ఫిబ్రవరి 2, బుధవారం ఘనంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. మొత్తం 12 రోజులపాటుగా వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు తొలిరోజైన బుధవారం సాయంత్రం వేదపారాయణాల నడుమ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఇక ఫిబ్రవరి 3, గురువారం ఉదయం సమతామూర్తి సహస్రాబ్ది సమారోహం రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో అరణిమథనం, అగ్నిప్రతిష్ఠా, హోమాలు జరగనున్నాయి. అలాగే ఇష్టిశాష్టిలో దుష్టనిష్ట వారణకై శ్రీసుదర్శ నేష్టి, సర్వాభీష్టసిద్ధికై శ్రీవాసుదేవెష్టి కార్యక్రమాలు, అలాగే ప్రవచనమండపమంలో శ్రీశ్రీశ్రీ పెద్దస్వాద్ద స్వామివారి
అష్టోత్తరశత నామపూజ, ప్రవచనములు జరగనున్నాయి. ఇక గురువారం సాయంత్రం కూడా హోమాలు, ముఖ్యఅతిథుల సందేశములు ఉండనున్నాయి.
యాగశాలలో 1035 కుండాలలో మహాయజ్ఞం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్వికులు ఈ హోమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ ఉత్సవాలకు వాలంటీర్లగా విధులు నిర్వహించేందుకు కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు నేటి నుంచి జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాలకు సాధారణ భక్తులను కూడా అనుమతించనున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటుగా జరిగే యాగాలు/హోమములు, ప్రవచనాలకు వారు హాజరవచ్చని తెలిపారు. ఇక వేలసంఖ్యలో రుత్విక్కులు, వాలంటీర్లు, భక్తుల రాకతో ఆశ్రమంలో ఉత్సవ వాతావరణం నెలకోగా, పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా మారి, ఆధ్యాత్మికత వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ