భారత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫిబ్రవరి 6న జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి వన్డే ముందు భారత జట్టులోని కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారనే విషయం ఒక్కసారిగా కలకలం రేపింది. స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్తో సహా మరో 5 మంది సహాయ సిబ్బంది కరోనా బారిన పడినట్లు ప్రముఖ స్టార్ స్పోర్ట్స్ సంస్థ తెలిపింది. దీంతో ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగటం డోలాయమానంలో పడింది. ఒక వేళ జట్టులో పాజిటివ్ కేసులు పెరిగితే ఏకంగా సిరీస్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రస్తుతం టీమ్ మొత్తం ఐసోలేషన్లో ఉంది. అంతేకాకుండా గురువారం జరగాల్సిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేసారు. ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే భారత్- వెస్టిండీస్ సిరీస్ జరగుతుంది. అయితే ఇండియా క్యాంపులో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదైతే మాత్రం సిరీస్ నిర్వహించే అంశమై ఒక నిర్ణయానికొస్తాం అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. తాజా పరిస్థితిని బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోందని స్టార్ స్పోర్ట్స్ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ