బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. “బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సాల్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా బీజేపీ ఇంఛార్జ్గా సునీల్ బన్సాల్ కు బాధ్యతలు అప్పగించారు” అని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ జాతీయనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అత్యంత సన్నిహితుల్లో సునీల్ బన్సాల్ ఒకరిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంఛార్జ్గా సునీల్ బన్సాల్ ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY