కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే పదోతరగతి పరీక్షల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ జరిపి జూన్ 8 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ ఇలా అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
విద్యార్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఒక్క బెంచ్పై ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చొని పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నైట్లెతే వారిని ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
- జూన్ 8 – ఇంగ్లీష్ పేపర్ – 1
- జూన్ 11 – ఇంగ్లీష్ పేపర్ – 2
- జూన్ 14 – మ్యాథ్స్ పేపర్ – 1
- జూన్ 17 – మ్యాథ్స్ పేపర్ – 2
- జూన్ 20 – సైన్స్ పేపర్ – 1
- జూన్ 23 – సైన్స్ పేపర్ – 2
- జూన్ 26 – సోషల్ పేపర్ – 1
- జూన్ 29 – సోషల్ పేపర్ – 2
- జులై 2 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం మరియు అరబిక్)
- జులై 5 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం మరియు అరబిక్) మరియు ఒకేషనల్ కోర్సు (థియరీ)
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu