కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ సహా పలు పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై జేఎన్టీయూ-హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల 20 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది.
అలాగే జూలై 16 నుంచి బీటెక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడం, ధర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం వంటి నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu