దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టు 1, 2021 న జరగాల్సిన నీట్ (యూజీ)-2021 పరీక్షను కేంద్రప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ (యూజీ)-2021 పరీక్ష నిర్వహణ కొత్త తేదీని ఖరారు చేస్తూ కేంద్ర విద్యా శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రోటోకాల్ లను అనుసరించి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం నాడు ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ జూలై 13, మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్టిఎ వెబ్సైట్స్ ద్వారా ప్రారంభమవుతుందని చెప్పారు.
భౌతిక దూర ప్రమాణాలకు అనుగుణంగా, ఈ పరీక్ష నిర్వహించబడే నగరాల సంఖ్యను 155 నుండి 198కి పెంచామని చెప్పారు. అలాగే 2020లో 3862 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించగా, ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచబోతున్నట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండేలా, అభ్యర్థులందరికీ ఫేస్ మాస్క్ అందించబడుతుందని, కాంటాక్ట్లెస్ రిజిస్ట్రేషన్, శానిటైజేషన్, భౌతిక దూరంతో కూర్చునేలా ఏర్పాట్లు చేయబడతాయని పేర్కొన్నారు. ఈ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ