ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ గురువారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా కేఏ పాల్ పై ఓ యువకుడు చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో భద్రతా విషయంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో అమిత్ షాతో కేఏ పాల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ, కేవలం తనపై జరిగిన దాడి గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని, చాలా విషయాలు మాట్లాడడానికి వచ్చానన్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించామని, త్వరలోనే ప్రధాని మోదీని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంశాలు, శ్రీలంక ఆర్ధిక సంక్షోభం గురించి చర్చించామని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గమని కేఏ పాల్ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో తనపై జరిగిన దాడిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళి, బాద్యులపై చర్యలు తీసుకోవాలని, తనకు సెక్యూరిటీ పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కేఏ పాల్ కోరినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF