తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ గడువు మే 7 తేదీతో ముగియనుండడం, మరోవైపు పలు సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మూడో విడత లాక్డౌన్ ను మే 17 వ తేదీ వరకు పొడిగించండంతో రాష్ట్రంలో అమలు చేసే భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్డౌన్ అమలులో కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు, పరీక్షల నిర్వహణ, ఇతర ఆర్ధిక వ్యవహారాల ప్రారంభించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ సోకినవారు, వైరస్ తో మరణిస్తున్నవారు అత్యధిక శాతం మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందినవారేనని, ఆ జిల్లాల్లో లాక్డౌన్ ను కట్టుదిట్టంగా కొనసాగించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్ కు నివేదించడంతో లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో ప్రజా రవాణతో పాటుగా మద్యం అమ్మకాలపై నిర్ణయాలు వెలువరించాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ప్రకటించిన సడలింపులపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్ తో సహా ఇతర అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu