ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఆగస్టు 1, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న తెలంగాణ దళిత బంధు పథకం, 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, చేనేత కార్మికులకు భీమా సదుపాయం, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యవసాయ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు జూలై 13,14 తేదీల్లో కూడా వరుసగా రెండ్రోజుల పాటుగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ