ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (ఆగస్టు 11, గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ అంశం మీద కీలకంగా చర్చించనున్నట్టు తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అలాగే కొత్త పెన్షన్ల మంజూరు, ధాన్యం అమ్మకాలు, రాష్ట్రంలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్పరివర్తన కలిగిన ఖైదీల విడుదల, మునుగోడు ఉపఎన్నిక సహా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY