తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ కేబినెట్ సబ్ కమిటీ గురువారం నాడు భేటీ కానుంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని, సమగ్ర నివేదికను అందించాలని రాష్ట్ర కేబినెట్ ఈ కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించింది. దీంతో వైద్య సేవలు, మౌలిక వసతులపై అధ్యయనం విషయంపై కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ