ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Facilities in Govt Hospitals, Mango News, Telangana Cabinet Sub Committee, Telangana Cabinet Sub Committee Meet, Telangana Cabinet Sub Committee Meet Over Facilities in Govt Hospitals, Telangana Cabinet Sub Committee Review on Medical and Health Department, Telangana Cabinet Sub Committee to Meet Today, Telangana Cabinet Sub Committee to Meet Today to Review Facilities in Govt Hospitals, Telangana Cabinet sub-committee on health for strengthening

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ కేబినెట్ సబ్ కమిటీ గురువారం నాడు భేటీ కానుంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని, సమగ్ర నివేదికను అందించాలని రాష్ట్ర కేబినెట్ ఈ కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించింది. దీంతో వైద్య సేవలు, మౌలిక వసతులపై అధ్యయనం విషయంపై కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =