తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి మీడియాకు వివరించారు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క 125 అడుగుల భారీ విగ్రహన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహా నిర్మాణం పూర్తయిందని, ఇది దేశంలోనే అతి పెద్ద విగ్రహమని అన్నారు. ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
ఏప్రిల్ 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి దళిత వర్గాల ప్రజలను హైదరాబాద్ కు పిలిపించి, లక్షలాది మంది ప్రజల మధ్య ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప పండుగలా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఒక భారీ సభ కూడా నిర్వహించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE