ప్రముఖ ‘కథక్’ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుముశారు. మహారాజ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేసారు. పండిట్ బిర్జూ మహారాజ్ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మహారాజ్ ‘కళాశ్రమం’ పేరుతొ ఢిల్లీలో నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు. మహారాజ్ పలు బాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశారు. దేవదాస్, ఉమ్రావ్ జాన్, బాజీరావ్ మస్తానీ వంటి హిస్టారికల్ మూవీస్ కి కొరియోగ్రఫీ అందించారు. బిర్జు మహారాజ్ 1986వ సంవత్సరంలో ‘పద్మ విభూషణ్’ అవార్డును అందుకున్నారు. కాగా, మహారాజ్ మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ