పంట మార్పిడి పై సీఎం కేసీఆర్ సమీక్ష, చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు

agriculture policy, CM KCR, CM KCR Review Over Crops Cultivation, Crops Cultivation and Policies, KCR Conducts Review Over Crops Cultivation and Policies, Paddy cultivation, Rythu Bandhu Scheme, telangana, telangana agriculture development, Telangana Agriculture News, Telangana CM KCR

రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 12, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను చర్చించేందుకు ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడాలని సీఎం నిర్ణయించారు.

‘‘అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే నానుడి రాష్ట్రంలో, దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. పండించిన పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు, కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు ఉంటాయి. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. సేవారంగం, ఐటి రంగం, కొత్త వృత్తులు ఈ మధ్య వచ్చినవి. గతంలో అంతా వ్యవసాయమే. నేరుగా పంటలు పండించే రైతులు, అందులో పనిచేసే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉండే వారు ఇలా సమాజంలో 90-95 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వారే. మన రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం, దేశం వ్యవసాయక దేశం. దేశంలో ఒకప్పుడు తీవ్రమైన కరువు ఉండేది. కీలకనామ సంవత్సరంలో అయితే విపరీతమైన ఆహార కొరత కూడా ఏర్పడింది. తొండల్లాగా బతకాల్సి వచ్చింది. ఈ తర్వాత అనేక పరిణామాలు మారాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ది సాధించాం. ఆహార కొరత లేకుండా అయింది. తర్వాత పరిణామాల్లో రైతు పండించిన పంటకు మంచి ధర రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతులు పండించిన పంటలకు గౌరవ ప్రదమైన ధరలు రావాలంటే ఏం జరగాలి? అని మనం ఆలోచించుకోవాలి. గతం మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక వహించి మౌనంగా ఉండాలా? మార్పు కోసం ప్రయత్నించాలా? దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవసాయంపై చిత్తశుద్ధితో పనిచేయలేదు. తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. రాష్ట్రంలో గతంలో వ్యవసాయం పరిస్థితి వేరు, ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నది. కరెంటు గండం గట్టెక్కింది. సాహసోపేతంగా తలపెట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అవుతున్నది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ సారి ప్రభుత్వం మొత్తం పంటను కొనుగోలు చేస్తున్నది. దేశం మొత్తం కరోనా ఉన్నప్పటకీ మరే రాష్ట్రంలో ఇలా మొత్తం పంటను కొనుగోలు చేయడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే కొనుగోలు చేస్తున్నాము. ఇది తెలంగాణ ప్రత్యేకత. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్నది. ప్రపంచమే తెలంగాణ నుంచి నేర్చుకోవాలని అభిలషిస్తున్నది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘‘రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడం. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని నేను ఇవాళ చెప్పడం లేదు. 20 ఏళ్ల క్రితం నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెబుతున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పాను. ఇంతకు మించిన గత్యంతరం లేదు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘‘ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి. అమ్ముడుపోయే సరుకే పండించాలి. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతున్నది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెబుతున్నది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి. రైతుల ఆలోచనలో మార్పు రావాలి. నిర్మాణాత్మకమైన మార్పులు రావాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

వరిపంటతో మార్పు ప్రారంభం:

ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని మంగళవారం జరిగిన వ్యవసాయ సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయం జరిగింది.

ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని నిర్ణయించారు. ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండించాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాంతంలో ఎంత మేరకు కూరగాయలు పండించాలి? ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు ప్రభుత్వం సూచిస్తుంది.

సీడ్ రెగ్యులేటింగ్ అథారిటి ఏర్పాటు:

రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే అమ్మాలి. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగ సమావేశం కావాలని సిఎం నిర్ణయించారు.

కల్తీ, నకిలీలపై ఉక్కుపాదం:

  • నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని వెంటనే గుర్తించి, పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.
  • సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలని కోరింది.
  • రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • మార్కెటింగ్ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది.
  • తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది. ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్ధ్యం బాగా పెరగాల్సి ఉంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.

15న క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్:

నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న మద్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఎడిఎ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఎఇవోలు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామాల రైతు బంధు సమితిల అధ్యక్షులు పాల్గొంటారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, బి.జనార్థన్ రెడ్డి, రామకృష్ణరావు, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, హర్టికల్చర్ కార్పోరేషన్ ఎండీ వెంకట్రామ్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, ఉప సంచాలకులు శైలజ, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Mulugu MLA Seethakka Angry Speech Over Spreading False Rumors On Her | Telangana News | Mango News
04:01
Video thumbnail
Etela Rajender Superb Answer To Reporter Over Traffic Jams In Hyderabad | #Covid19 | Mango News
07:31
Video thumbnail
Minister Etela Rajender About New Green Zone Districts In Telangana | #CoronaVirus | Mango News
07:38
Video thumbnail
Minister Etela Rajender Says Corona Positive Woman Safely Delivers Baby | #Covid19 | Mango News
05:58
Video thumbnail
CM KCR Serious Comments On Opposition Parties | #CoronaOutbreak | #TelanganaLockdown | Mango News
07:33
Video thumbnail
CM KCR Asks Apologies To Muslims For Facing Problems In Ramadan Month | #CoronaVirus | Mango News
10:12
Video thumbnail
CM KCR About Providing Salaries For Govt Employees | #LockdownUpdates | Telangana News | Mango News
11:16
Video thumbnail
CM KCR Face To Face Challenge For Congress Leaders In Press Meet | TRS Vs Congress | Mango News
11:45
Video thumbnail
హైదరాబాద్ ప్రజలు నన్ను క్షమించాలి | CM KCR About His Apologies For Hyderabad People In Press Meet
05:06
Video thumbnail
CM KCR Says Karimnagar Stands Ideal For Control Of Corona | #Corona | #TelanganaLockdown | MangoNews
05:38
Video thumbnail
CM KCR Mentioned Corona Vaccine Will Get Ready By August | #Covid19 | #LockdownUpdates | Mango News
08:34
Video thumbnail
మే 29 వరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు | Lockdown Will Be Extended To May 29 Says CM KCR | MangoNews
09:25
Video thumbnail
CM KCR About Manufacturing Of Covid19 Medicine In Hyderabad | #KCRPressMeet | #TelanganaLockdown
06:59
Video thumbnail
Talasani Srinivas Yadav About Movie Shootings After Lockdown | #TelanganaLockdown | Mango News
11:34
Video thumbnail
MP Revanth Reddy Emotional Speech About Koheda Farmers Problems | Telangana News | Mango News
03:22
Video thumbnail
Uttam Kumar Reddy Demands 10 Lakhs Relief To Each Family In Telangana | #CoronaVirus | Mango News
05:42
Video thumbnail
Uttam Kumar Reddy Says Less Number Of Corona Tests Conducted In Telangana | #Covid19 | Mango News
05:39
Video thumbnail
Minister Etela Rajender Fires On Opposition Over Cheap Politics | #Corona | #Lockdown | Mango News
13:06
Video thumbnail
Etela Rajender Excellent Words About Daily Wage Workers In Telangana | #CoronaVirus | Mango News
06:47
Video thumbnail
Minister Etela Rajender Says To Visit King Koti Hospital For Corona Tests | #Covid19 | Mango News
06:59
Video thumbnail
CM KCR Vs MP Revanth Reddy | CM KCR Thanked Donars | MP Revanth Redddy Donates 50 Lakhs | Mango News
08:29
Video thumbnail
Etela Rajender Gives Clarity Over Lockdown Extension In Telangana | #CoronavirusOutbreak | MangoNews
06:34
Video thumbnail
Minister Etela Rajender Responds Over Accusation Made By Oppositions | #CoronaVirus | Mango News
09:24

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =