తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 25వ తేదీన మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశమునట్టు తెలుస్తుంది. దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు మరియు అభివృద్ధి పనులపై సమీక్షించడం కోసం కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 26న సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశమునట్టు సమాచారం.
గత ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై లేఖలు అందజేయడంతో పాటుగా, ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ ‘తెలంగాణ భవన్’ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని కోరారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, లేఖలు అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ