తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 12, శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటుగా ప్రధానితో వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సహకారం, హైదరాబాద్ లో ఇటీవల వర్షాలు, వరదల వలన జరిగిన నష్టం, జీఎస్టీ నిధుల విడుదల వంటి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న విభజన హామీల పరిష్కరానికి కూడ చొరవ చూపాలని ప్రధాని మోదీని, సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీకి ముందు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విమానయాన, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరితో కూడా సీఎం కేసీఆర్ భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ