తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహా ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో గురువారం నార్కట్పల్లిలో నిర్వహించే సంతాపసభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ లో హైదరాబాద్ నుంచి బయలుదేరి నార్కట్పల్లికి చేరుకుంటారు. అనంతరం అక్కడ నిర్వహించే సంతాప సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటుగా మంత్రి జగదీశ్రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం నుంచి సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ