తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 11, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 84,544 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 22,972 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 479, మేడ్చల్ లో 172, రంగారెడ్డిలో 162, సంగారెడ్డిలో 107, వరంగల్ అర్బన్ లో 87, కరీంనగర్ లో 64, ఖమ్మంలో 63, పెద్దపల్లిలో 62, సిద్ధిపేటలో 62, నల్గొండలో 54, కామారెడ్డిలో 48, భద్రాద్రి కొత్తగూడెంలో 44, రాజన్న సిరిసిల్లలో 43, మహబూబ్ నగర్ లో 41, జోగులాంబ గద్వాల్ లో 38, మంచిర్యాలలో 38, సూర్యపేటలో 36, జగిత్యాలలో 28, జనగామలో 26, మెదక్ లో 26, వనపర్తిలో 26, వరంగల్ రూరల్ లో 24, నిజామాబాద్ లో 23, నిర్మల్ లో 21, ఆదిలాబాద్ లో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 11, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 6,65,847
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 84,544
- కొత్తగా నమోదైన కేసులు : 1897
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 61,294
- కరోనా రికవరీ రేటు: 72.49%
- యాక్టీవ్ కేసులు : 22,596
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 15,534
- మొత్తం మరణాల సంఖ్య : 654
- కరోనా మరణాల రేటు: 0.77%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu