ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. కాఫర్ డ్యాం సహా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇతర నిర్మాణ పనులపై అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి సమావేశ మందిరంలో పనులు పురోగతి, ఇతర అంశాలపై సంబంధిత అధికారులు, ఇంజనీర్లుతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావడం ఇది మూడోసారి. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, పలువురు మంత్రులు ఉన్నారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ