తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 577 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 6, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,48,388 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,819 కి పెరిగింది. కొత్తగా 645 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,35,895 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 79, కరీంనగర్ లో 66, ఖమ్మంలో 42, వరంగల్ అర్బన్ లో 38, నల్గొండలో 36,పెద్దపల్లిలో 34, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 30, రంగారెడ్డిలో 25, వరంగల్ రూరల్ లో 25 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 6, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,26,37,722
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,48,388
- కొత్తగా నమోదైన కేసులు : 577
- నమోదైన మరణాలు : 2
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,35,895
- కరోనా రికవరీ రేటు: 98.07%
- యాక్టీవ్ కేసులు: 8,674
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3819
- కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ